నేడు శాలిగౌరారం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2020-08-13T10:50:52+05:30 IST
శాలిగౌరారం మార్కెట్ కమిటీ తొలి పాలకవర్గం ఈ నెల 13న మధ్యాహ్నం 2గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది
శాలిగౌరారం, ఆగస్టు 12 : శాలిగౌరారం మార్కెట్ కమిటీ తొలి పాలకవర్గం ఈ నెల 13న మధ్యాహ్నం 2గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జగదీ్షరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ హాజరవుతున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్ తెలిపారు. మార్కె ట్ కమిటీ తొలి చైర్పర్సన్గా అడ్లూరు గ్రామానికి చెంది న కట్టా లక్ష్మీవెంకట్రెడ్డి, వైస్ చైర్మన్గా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన గుజలాల్ శేఖర్బాబు, డైరెక్టర్లుగా ఏమిరెడ్డి నర్సిరెడ్డి, సిర్పంగి సత్యం, గాదె అర్లారెడ్డి, సుల్తాన్ శ్రీనివాస్, కుంభం రమేష్, జంగిలి వీరస్వాములు, వలిశెట్టి యాదయ్య, బెలిది రమేష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం జరిగే సభా స్థలాన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అయితగోని వెం కన్నగౌడ్, మాజీ అధ్యక్షుడు కట్టా వెంకట్రెడ్డి, నాయకులు శేఖర్బాబు, మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి వెంకన్న పరిశీలించారు.