నేడు నర్సింహయ్య సంతాప సభ
ABN , First Publish Date - 2020-12-13T05:40:28+05:30 IST
దివంగత నేత, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఆదివారం హాలియా ఎంసీఎం కళాశాలలో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నారు.

హాలియా, డిసెంబరు 12: దివంగత నేత, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఆదివారం హాలియా ఎంసీఎం కళాశాలలో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నారు. ఈ సంతాప సభకు మంత్రులు కేటీఆర్, హరీ్షరావుతోపాటు తలసాని శ్రీనివా్సయాదవ్, జగదీ్షరెడ్డి, ఈటెల రాజేందర్, యర్రబెల్లి దయాకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షు డు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.