కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-06-23T09:49:45+05:30 IST

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకు లు ఆరోపించారు. కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌): కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకు లు ఆరోపించారు. కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద పార్టీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు.  సూ ర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) పీహెచ్‌సీ ఎదుట సోమవారం ధర్నా నిర్వ హించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌, మన్మథరెడ్డి, పందిరిరాంరెడ్డి, గోపగాని రామకృష్ణ, పందిరి మాధవరెడ్డి, హేమసుం దర్‌, మల్సూర్‌ ఉన్నారు.


హుజూర్‌నగర్‌లోని ఏరియా ఆసుప త్రి ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో నాయకులు కుం దూరు కోటిరెడ్డి, నర్సింగ్‌ సతీష్‌, జగన్‌, నాగరాజు, తిరుమలరావు, ప్రసాద్‌, ఉపేందర్‌, విజయ్‌ పాల్గొన్నారు. నేరేడుచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిన్నపల్లి శ్రీనివాస్‌, నాయకులు తాళ్లూరి రమేష్‌, జూ లూరి అశోక్‌, శ్రవణ్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. తిరుమల గిరిలోని హీహెచ్‌సీలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దీన్‌దయాల్‌, కొండ సోమయ్య, ఈదునూరి సుభాష్‌రెడ్డి పాల్గొ న్నారు. చింతపల్లి పీహెచ్‌సీ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీకన్వీనర్‌ చనమోనిరాములు, మండల అధ్యక్షుడు శివర్ల రమేష్‌యాదవ్‌ పాల్గొన్నారు. పీఏపల్లి, గుడిపల్లి పీహెచ్‌సీ ఎదుట నిరసన తెలిపారు.


దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.  కార్యక్రమంలో నాయకులు బెజవాడ శేఖర్‌, కేతావత్‌ లాలూనాయక్‌ పాల్గొన్నారు. మిర్యాలగూడలోని ఏరియా ఆస్పత్రి ఎదుట ఽధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాథినేని శ్రీనివాసరావు, బంటు సైదులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఎదుట ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, నూకల మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నా రు. పెద్దవూర, నిడమనూరు, డిండి, గుర్రంపోడులోని పీహెచ్‌సీల ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.


భువనగిరిలో జరిగిన ఆందోళనలో బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, దాసరి మల్లేశం పాల్గొన్నారు. ఆలేరులో జరిగిన ధర్నాలో సిరిగే శ్రీనివాస్‌, తునికి దశరథ, కౌన్సిలర్‌ సంగు భూపతి పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో బీజేపీ నాయకుడు రచ్చ శ్రీనివాస్‌, గుంటిపల్లి సత్యంగౌడ్‌ పాల్గొన్నారు. చౌటుప్పల్‌లో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల బిక్షంగౌడ్‌, రిక్కల సుధాకర్‌రెడ్డి, ఊడుగు వెంకటేశం పాల్గొన్నారు. రామన్నపేటలో బీజేపీ నాయకులు తాటిపాముల శివకృష్ణగౌడ్‌, నకిరేకంటి మొగులయ్య పాల్గొన్నారు. నకిరేకల్‌లో జరిగిన కార్యక్రమంలో మండల వెంకన్న, శ్రీనివా్‌సగౌడ్‌, పాల్గొన్నారు. చిట్యాలలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూరెళ్ళ శ్రీను పాల్గొన్నారు. కట్టంగూరులో జరిగిన నిరసనలో నాయకులు సుధా కర్‌రెడ్డి, గోలి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. నార్కట్‌పల్లి పీహెచ్‌సీ ఎదుట ధర్నా నిర్వహించారు.


కార్యక్రమంలో కొర్వి శంకర్‌, నర్సింహ, తరాల శ్రీనివాస్‌ ఉన్నారు. మర్రిగూడ, శాలిగౌరారంలో చెరుకు శ్రీరాములగౌడ్‌,  వెంకన్న, జమ్ము రమేష్‌, కొప్పుల నర్సింహ ఆకుల రవి ఉన్నారు. చిట్యాలలో జరిగిన కార్యక్రమంలో చికిలంమెట్ల అశోక్‌, రాఘవరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-23T09:49:45+05:30 IST