అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై కృతజ్ఞతలు
ABN , First Publish Date - 2020-12-31T04:37:00+05:30 IST
ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వ రకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600కోట్లు మంజూరు చేసినందుకు గాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ రూరల్, డిసెంబరు 30 : ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వ రకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600కోట్లు మంజూరు చేసినందుకు గాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సం దర్భంగా పలు ప్రాజెక్టులపై వినతిపత్రం అందించారు. మిర్యాలగూడ పట్ట ణం పెరుగుతున్నందున అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరించాలన్నారు.