యాదాద్రి ఆలయ పూర్వ ధర్మకర్త తాడూరి కృష్ణ కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-11T05:54:33+05:30 IST

భువనగిరి పట్టణానికి చెందిన యాదగిరిగుట్ట ఆలయ మాజీ ధర్మకర్త, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి కృష్ణ గురువారం అనారోగ్యంతో మృతిచెందారు.

యాదాద్రి ఆలయ పూర్వ ధర్మకర్త తాడూరి కృష్ణ కన్నుమూత
కృష్ణ(ఫైల్‌)

యాదాద్రి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): భువనగిరి పట్టణానికి చెందిన యాదగిరిగుట్ట ఆలయ మాజీ ధర్మకర్త, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి కృష్ణ గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతికి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, మునిసిపల్‌ మాజీ చైర్మెన్‌ బర్రె జహంగీర్‌, నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్‌, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, ఎండీ బబ్లూ, దర్గాయి హరిప్రసాద్‌, కొల్లూరి రాజు, మనోజ్‌, డాకూరి నిరంజన్‌ ఉన్నారు. 


Updated Date - 2020-12-11T05:54:33+05:30 IST