అభివృద్ధికోసం పోరాటం: కోదండరాం
ABN , First Publish Date - 2020-10-03T10:44:30+05:30 IST
రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధి కోసం చేపడుతున్న అన్ని రకాల పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షు డు పొఫెసర్ కోదండరాం అన్నారు.
తుర్కపల్లి(బొమ్మలరామారం), అక్టోబరు 2: రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధి కోసం చేపడుతున్న అన్ని రకాల పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షు డు పొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయన శక్రవారం బొమ్మల రామారంలో మాజీ ఉపసర్పంచ్ బేతాల శ్రీనివాసులు సొంత ఖర్చులతో గాంధీ విగ్రహం వద్ధ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షులు బండ్రు శోభారాణి, ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, సర్పంచ్లు రాంపల్లి మహెశ్, బిట్టు శ్రీనివాస్, ఎంపీటీసీలు మైలారం ఈదమ్మయాదయ్య, ఫకీర్రాజేందర్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు జగ్గర్ల ఆనంద్గౌడ్, సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు అన్నెమైన వెంకటేశ్, ర్యాకల శ్రీశైలం, నాయకులు సిద్ధగాని సుదర్శన్, మర్రి బగవంత్రెడ్డి రాజమల్లారెడ్డి పాల్గొన్నారు.