సాగర్లో టీడీపీ పోటీ : జీవీజీ నాయుడు
ABN , First Publish Date - 2020-12-25T06:18:15+05:30 IST
సాగర్ ఉప ఎన్నికల బరిలో టీ డీపీ అభ్యర్థిని నిలబెడుతుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ అన్నారు.
![సాగర్లో టీడీపీ పోటీ : జీవీజీ నాయుడు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హాలియా, డిసెంబరు 24: సాగర్ ఉప ఎన్నికల బరిలో టీ డీపీ అభ్యర్థిని నిలబెడుతుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ అన్నారు. హాలియాలో నియోజకవర్గ ఇన్చార్జి మువ్వా అరుణ్కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసి న ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సాగర్లో టీడీపీకి బలమైన సానుభూతిపరులు, కార్యకర్తలు ఉన్నారని, సాగర్ అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు.