సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ పనులు పరిశీలించిన పువ్వాడ, స్మితా
ABN , First Publish Date - 2020-07-11T01:43:34+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులను రవాణా

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజిత్ కుమార్ పరిశీలించారు. పంప్ హౌస్ పనుల పురోగతిపై ఎస్ఈ, సీఈలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ, సీఈలకు స్మిత సబర్వాల్ పలు సలహాలు, సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం పనులు వేగంగా చేయాలని ఇరిగేషన్శాఖ అధికారులు, కాట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు.