రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం తగదు : సీపీఎం
ABN , First Publish Date - 2020-12-13T05:34:33+05:30 IST
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అది తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అన్నారు.

మాడ్గులపల్లి, డిసెంబరు 12 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అది తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా శనివారం ఆయన రైతు సంఘాల నాయకులతో కలిసి మం డల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల కోసమే మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. నూత న వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాడ్గులపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని అరెస్ట్ చేసి పోలీ్సస్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి శ్రీనివాస్, శ్రీకర్, నాగార్జున, లక్ష్మీనారాయణ, రాంరెడ్డి, నాగిరెడ్డి, నర్సిరెడ్డి, విష్ణు, నాగయ్య పాల్గొన్నారు.