బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-04-08T10:49:32+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు పంపిణీ చేస్తున్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను

సూర్యాపేట(కలెక్టరేట్), ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు పంపిణీ చేస్తున్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలని సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా వైర్సను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.1500 జమ చేయాలన్నారు. కరోనా వైర్సను వ్యాప్తి చెందకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య, పోలీస్, పారిశుద్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ అంజద్అలీ, నాయకులు నరేందర్నాయుడు పాల్గొన్నారు.