పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి భరోసా

ABN , First Publish Date - 2020-12-11T06:21:22+05:30 IST

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి భరోసా
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ, డిసెంబరు 10 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మండలానికి చెందిన 41మంది లబ్ధిదారులకు రూ.45లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో నాలు గేళ్లుగా వెయ్యిమందికి రూ.9కోట్లు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీచేసి ఆదుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారేపాకల అరుణసురే్‌షగౌడ్‌, వైస్‌ఎంపీపీ సుభా్‌షగౌడ్‌, రహత్‌అలీ, శిరందాసు కృష్ణయ్య, తహసీల్దార్‌ కిరణ్మయి, డీటీ హర్షద్‌, మురళి, రైసోద్దీన్‌, సైదులు, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:21:22+05:30 IST