నారాయణ మృతి తీరని లోటు : జాజుల
ABN , First Publish Date - 2020-12-28T05:52:26+05:30 IST
బీసీ సంక్షేమ సంఘం భువనగిరి పట్టణ అధ్యక్షుడు గుమ్మల నారాయణ మృతి బీసీ ఉద్యమాలకు తీరని లోటు అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్ అన్నారు.
భువనగిరి టౌన్, డిసెంబరు 27: బీసీ సంక్షేమ సంఘం భువనగిరి పట్టణ అధ్యక్షుడు గుమ్మల నారాయణ మృతి బీసీ ఉద్యమాలకు తీరని లోటు అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన నారాయణ సంతాప సభలో ఆయన మాట్లాడారు. నారాయణ స్ఫూర్తితో బీసీలు హక్కుల సాధనకు ఉద్యమించాలన్నా రు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొత్త నర్సింహ స్వామి, కాదూరి అచ్చయ్యగౌడ్, జి.బాబురావు, వి.మధు, వెంకటేష్, లక్ష్మీనారాయణ, రాజు పాల్గొన్నారు.