ఆస్తికోసం బాలికను బంధించి చిత్రహింసలు
ABN , First Publish Date - 2020-11-19T12:48:35+05:30 IST
ఆస్తి కోసం మైనర్ బాలికను బంధించి చిత్రహింసలు గురి చేసిన ఘటన జిల్లాలోని మిర్యాలగూడలో చోటు చేసుకుంది.
![ఆస్తికోసం బాలికను బంధించి చిత్రహింసలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నల్లగొండ: ఆస్తి కోసం మైనర్ బాలికను బంధించి చిత్రహింసలు గురి చేసిన ఘటన జిల్లాలోని మిర్యాలగూడలో చోటు చేసుకుంది. బాలిక చిన్నమ్మ ఓ వ్యక్తితో కలిసి చిన్నారిని 11 రోజుల పాటు గదిలో బంధించి తీవ్రంగా హింసించింది. ఈ నెల 8న బాధిత కుటుంబ సభ్యులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గత రాత్రి బాలికను ఆమె చిన్నమ్మ ఇంటివద్ద వదిలేసింది. వెంటనే వన్ టౌన్ పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.