కోదాడ - జడ్చర్ల రహదారిపై రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2020-11-03T15:33:52+05:30 IST
జిల్లాలోని మిర్యాలగూడ అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు.
నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. మార్కెటింగ్ శాఖ ధాన్యం కొనుగోలు కేంద్రంలో టోకెన్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోదాడ -జడ్చర్ల రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.