హైదరాబాద్: ఓల్డ్ సిటీలో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి
ABN , First Publish Date - 2020-10-14T18:21:03+05:30 IST
నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది.

హైదరాబాద్: నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ విధంగా వరద ప్రవహిస్తోంది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోయాయి. కొత్తగా వేసిన రోడ్లు కూడా గుంటలు పడ్దాయి.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటంటే.. నాళాలు, నగర శివారులో ఉన్న చెరువులు కబ్జాకు గురికావడంతో చెరువులు కట్టలు తెగి వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటిలో సుమారు 10 మంది గల్లంతయినట్లు సమాచారం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం స్పందించి కబ్జాకు గురైనా నాళాల విషయంలో, వరద నీరు రోడ్డుమీదకు రాకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.