కొడుకు చేతిలో తల్లి హతం... రోకలిబండతో కొట్టడంతో..
ABN , First Publish Date - 2020-07-08T21:09:34+05:30 IST
మద్యానికి డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహంతో కన్నతల్లినే రోకలిబండతో మోది కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి
మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో తరుచూ గొడవ
నిరాకరించడంతో రోకలిబండతో మోదిన కొడుకు
పెద్ద అడిశర్లపల్లి (నల్లగొండ): మద్యానికి డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహంతో కన్నతల్లినే రోకలిబండతో మోది కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్తండాలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేగావత్ బుజ్జి(48), భర్త ధర్మ 10 సంవత్సరాల క్రితం మృతిచెందాడు. కూలీ పనిచేసుకొని జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు మున్నా కూలీ పనిచేసుకొని ఇంటి వద్దనే తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. అతడు ఇటీవల మద్యానికి బానిసై డబ్బులకోసం తరుచూ తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. బుధవారం కూడా డబ్బులు అడగడంతో, ఆమె అందుకు నిరాకరించింది. దీంతో పక్కనే ఉన్న రోకలిబండతో మోదడంతో బుజ్జి అక్కడికక్కడే మృతిచెందింది. బుజ్జి పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు.