అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటాం : కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2020-12-31T04:44:17+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, మనిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటాం : కాంగ్రెస్‌
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

మిర్యాలగూడ టౌన్‌, డిసెంబరు 30 : టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, మనిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మునిసిపల్‌ కౌన్సిల్‌ అజెండాలో టీఆర్‌ఎస్‌ కౌన్సిల్‌ సభ్యులకు అనుకూలంగా నిధులు కేటాయిస్తూ అజెండా తయారు చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలో బుధవారం భారీ ర్యాలీ తీసి మునిసిపాలిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారన్నారు. బీఎల్‌ఆర్‌ మాట్లాడుతూ  అజెండాలో పొందుపరచిన 1, 2, 3, 74వ అం శాలు న్యాయపరంగా లేవని, సభ్యులతో చర్చించకుండా కౌన్సిల్‌ ఆమోదానికి ప్రవేశపెట్టడం సరికాదన్నారు.

Updated Date - 2020-12-31T04:44:17+05:30 IST