జూనియర్ న్యాయవాదులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-03-27T11:24:56+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకోవాలని జూనియర్ న్యాయవాదులు కోరుతున్నారు.
మిర్యాలగూడ లీగల్, మార్చి 26: లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకోవాలని జూనియర్ న్యాయవాదులు కోరుతున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.100 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా దీనిపై స్పందించలేదని, ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలని జూనియర్ న్యాయవాదులతోపాటు, న్యాయవాద గుమస్తాలు గురువారం ఒక ప్రకటనలో కోరారు.