అందుబాటులో ఉన్న స్థలాలు గుర్తించాలి

ABN , First Publish Date - 2020-09-19T09:47:11+05:30 IST

శ్మశాన వాటికలు, కంపోస్ట్‌ యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భూములను గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టే

అందుబాటులో ఉన్న స్థలాలు గుర్తించాలి

 భువనగిరి రూరల్‌: శ్మశాన వాటికలు, కంపోస్ట్‌ యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అందుబాటులో  ఉన్న భూములను గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి ఆన్‌లైన్‌ గూగుల్‌ మీట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పథకాల నిర్మాణాలకు స్థలాల సమస్యలు ఉన్న గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి తర్వితగతిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T09:47:11+05:30 IST