హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు స్వాగతం

ABN , First Publish Date - 2020-12-15T05:57:00+05:30 IST

నల్లగొండలో నిర్వహించిన పౌర సన్మానంలో పాల్గొనేందుకు నల్లగొండకు సోమవారం వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండ ారు దత్తాత్రేయకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎస్పీ ఏవీ. రంగనాథ్‌ స్వాగతం పలికారు.

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు స్వాగతం
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌, ఎస్పీ

నల్లగొండ క్రైం, డిసెంబరు 14: నల్లగొండలో నిర్వహించిన పౌర సన్మానంలో పాల్గొనేందుకు నల్లగొండకు సోమవారం వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండ ారు దత్తాత్రేయకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎస్పీ ఏవీ. రంగనాథ్‌ స్వాగతం పలికారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పూలమొక్కలు అందజేశారు. జిల్లాకు వస్తున్న తరుణంలో దత్తాత్రేయ వాహనానికి జరిగిన ప్రమాద వివరాలను అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అన్నిమళ్ల కొం డల్‌రావు, డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, తహసీల్థార్‌ నాగార్జునరెడ్డి ఉన్నారు. చౌటుప్పల్‌ వద్ద ప్రమాదానికి గురైన గవర్నర్‌ దత్తాత్రేయ వాహన ప్రమాద ఘటనలో స్వల్ప గా యాలైన గవర్నర్‌, ఆయన వ్యక్తిగత పీఏకు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స చేశారు.   


Updated Date - 2020-12-15T05:57:00+05:30 IST