‘సమాచారం అడిగితే వేధిస్తున్నారు’

ABN , First Publish Date - 2020-12-15T05:41:51+05:30 IST

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, వాటికి సంబంధించి సమాచారం అడిగినందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండలానికి చెందిన తల్లీ, కుమారులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

‘సమాచారం అడిగితే వేధిస్తున్నారు’

మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితులు

నడిగూడెం, డిసెంబరు 14 : ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, వాటికి సంబంధించి సమాచారం అడిగినందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండలానికి చెందిన తల్లీ, కుమారులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో బాధితులు నడిగూడెం మండలం చాకిరాలకు చెందిన మాతంగి నాగమ్మ, ఏసుబాబులను రాష్ట్ర కమిషన్‌ సభ్యులు సోమవారం విచారించారు. ఫిర్యాదుకు సంబంఽధించిన విషయాలను వారు కమిషన్‌ సభ్యులకు వివరించారు. గ్రామంతో పాటు మండలంలోని పలు అభివృద్ధి పనులపై ఆర్టీఏ చట్టం కింద దరఖాస్తు చేశానని, వివరాలు ఇవ్వకపోగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇందుకు సంబంఽధించి నడిగూడెం ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, మునగాల సీఐ, కోదాడ డీఎస్పీలపై ఫిర్యాదు చేసినట్లు ఏసుబాబు తెలిపారు. ఫిర్యాదుపై విచారించి చర్యలు చేపడతామని కమిషన్‌ సభ్యులు తెలిపినట్లు ఆయన వివరించారు.


Updated Date - 2020-12-15T05:41:51+05:30 IST