ఫ్లోరోసిస్ బాధితుడు స్వామికి ఇల్లు మంజూరు
ABN , First Publish Date - 2020-12-10T06:14:32+05:30 IST
ఫ్లోరోసిస్ బాధితుడు అంశుల స్వామి కి ఇల్లు మంజూరైంది. ఈ విషయాన్ని గృహ నిర్మాణశాఖ ఉన్నతాఽఽ ధికారి స్వామికి బుధవారంఫోన్ చేసి తెలిపారు. మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి పరిస్థితిపై నవంబరు 27వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ‘నాడు ఫ్లోరోసిస్ కోసం..నేడు గూడు కోసం’ శీర్షికన వార్త ప్రచు రితమైంది. ఈ వార్తకు గృహనిర్మాణశాఖ అధికారులు స్పందిం చి ఇల్లు మంజూరు చేశారు.

ఫోన్ చేసి తెలిపిన గృహనిర్మాణశాఖ అఽధికారి
మర్రిగూడ, డిసెంబరు 9: ఫ్లోరోసిస్ బాధితుడు అంశుల స్వామికి ఇల్లు మంజూరైంది. ఈ విషయాన్ని గృహ నిర్మాణశాఖ ఉన్నతాఽఽ ధికారి స్వామికి బుధవారంఫోన్ చేసి తెలిపారు. మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి పరిస్థితిపై నవంబరు 27వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ‘నాడు ఫ్లోరోసిస్ కోసం..నేడు గూడు కోసం’ శీర్షికన వార్త ప్రచు రితమైంది. ఈ వార్తకు గృహనిర్మాణశాఖ అధికారులు స్పందిం చి ఇల్లు మంజూరు చేశారు. స్వామి లేవలేని స్థితిలో ఉన్నందున ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు తెలిపారు. స్వామికి ఇల్లు, క్షౌరశాల ఏర్పాటు చేయలని కేటీఆర్ అప్పటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ను అదేశించారు. స్వామికి ఉపాధి కోసం రూ. 1.50 లక్షలతో క్షౌరశాల దుకాణం ఏర్పాటుచేశారు. దీని ద్వారా స్వామి ఉపాధి పొందుతున్నప్పటికీ డబుల్బెడ్రూం నిర్మించడంలో అధికా రులు నిర్లక్ష్యం చేశారు. దీనికోసం స్వామి పలు మార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. స్వామికి ఉన్న కొద్దిపాటి ఇల్లు కూడా వర్షానికి నేలమట్టం అయింది. దీంతో సరంపేట గ్రామంలో ఓ అనాథాశ్రమంలో అంశుల స్వామి కుటుంబం తలదా చుకుంటోంది. ఈ విష యాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవ డంతో గృహ ని ర్మాణ శాఖ అధి కారులు స్పందిం చారు. ‘కలెక్టర్ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారు. ‘త్వరలో నిర్మాణాన్ని ప్రారంభిస్తాం.’ అని గృహ నిర్మాణశాఖ అధికారి తెలిపారు. కలెక్టర్ మీకు డబుల్బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారని ఈనెలలోనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభి స్తామని అధికారి హమీ ఇచ్చినట్లు అంశుల స్వామితెలిపారు. ఇంటి సమస్య పరిష్కారం కావడంతో స్వామి సంతోషం వెలిబుచ్చాడు.