కంటైన్‌మెంట్‌ వారు బయటికి రావొద్దు

ABN , First Publish Date - 2020-04-15T10:13:28+05:30 IST

ప్రభుత్వం విధించిన కంటైన్‌మెంట్‌ ప్రాం తాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, లాక్‌డౌన్‌ను తప్పక

కంటైన్‌మెంట్‌ వారు బయటికి రావొద్దు

సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 


తిరుమలగిరి/నాగారం ఏప్రిల్‌ 14: ప్రభుత్వం విధించిన కంటైన్‌మెంట్‌ ప్రాం తాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, లాక్‌డౌన్‌ను తప్పక పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌క్రిష్ణారెడ్డి కోరారు. తిరుమలగిరి ము నిసిపాలిటీ, నాగారం మండలంలోని వర్థమానుకోట గ్రామంలో మంగళవారం పర్యటించారు. తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలో కంటైన్‌మెంట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలు అందుతున్న సేవలను అదికారుల ద్వారా తెలుసుకున్నా రు.


నిత్యావసర వస్తువుల కోసం కూడా బయటకు రావొద్దని, అధికారులే ఇళ్ల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలు మంచినీరు వేడి చేసుకొని తాగాలని సూచించారు. ఇళ్లనుంచి అనవసరంగా బయటికి వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. విధిగా మాస్కులు ధరించాలన్నారు. వర్థమానుకోటలోని ప్రతి వీధిలో హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలని పేర్కొన్నారు. రైతులు ధా న్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌, సీఐ శ్రీనివాస్‌, కమి షనర్‌ ఉమేష్‌చారి, ఎస్సై డానియల్‌, డాక్టర్‌ ప్రశాంత్‌ బాబు ఉన్నారు.

Updated Date - 2020-04-15T10:13:28+05:30 IST