ఆంజనేయస్వామి దేవాలయంలో దత్తాత్రేయ పూజలు
ABN , First Publish Date - 2020-12-15T05:36:48+05:30 IST
నాగారం మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగారం,డిసెంబరు 14 నాగారం మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగతుర్తిలో పలు విగ్రహావిష్కరణల అనంతరం తిరుగు ప్రయాణంలో ఆలయంలో పూజలు చేశారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య ఉన్నారు.