వీఎన్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం
ABN , First Publish Date - 2020-12-06T04:54:59+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకటనర్సింహారెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు.
సూర్యాపేట, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకటనర్సింహారెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. ఎంవీఎన్ భవన్లో మల్లు వెంకటనర్సింహారెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్క్సిస్టు పార్టీ నిర్మించడంలో కీలక భూమిక పోషించారన్నారు. సమావేశంలో నాయకులు ముల్కలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎల్గూరి గోవింద్, కోటగోపి, మట్టిపెల్లి సైదులు, వేల్పుల వెంకన్న పాల్గొన్నారు. అదేవిధంగా కోదాడ, గరిడేపల్లి, నడిగూడెం, తుంగతుర్తి, తుంగతుర్తి, హుజూర్నగర్, మేళ్లచెర్వు, ఆత్మకూర్(ఎస్) మండలాల్లోనూ వీఎన్ వర్ధంతిని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక నాయకులు పాల్గొన్నారు.