అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చింది...

ABN , First Publish Date - 2020-12-14T05:01:37+05:30 IST

గ్రామఅభివృద్ధికి సహకారం అందిస్తానని జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ కొత్తపల్లి మీన అన్నారు.

అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చింది...
కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డిలను సన్మానిస్తున్న నాగారం గ్రామస్థులు

నాగారం, డిసెంబరు 13 : గ్రామఅభివృద్ధికి సహకారం అందిస్తానని జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ కొత్తపల్లి మీన అన్నారు. ఎన్నికల్లో విజయాంనతం తల్లి శేషమ్మ ఆశీర్వాదం కోసం నాగారంబంగ్లాకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెతో పాటు భర్త ఉపేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గుండకండ్ల ముకుందారెడ్డి, వీరారెడ్డి, కుశలవరెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకటయ్య, రామనర్సింహరెడ్డి, వేణు, మల్లారెడ్డి, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-14T05:01:37+05:30 IST