దేశ గౌరవాన్ని చాటాలి : కల్నల్ శ్రీనివాస్
ABN , First Publish Date - 2020-12-11T05:45:12+05:30 IST
దేశ భవిష్యత్ యువతపైనే ఉందని ; ఆర్మీలో ఉద్యోగాలు సాధించి దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని లెఫ్ట్నెంట్ కల్నల్ సుంకరి శ్రీనివాసరావు అన్నారు.
నడిగూడెం, డిసెంబరు 10: దేశ భవిష్యత్ యువతపైనే ఉందని ; ఆర్మీలో ఉద్యోగాలు సాధించి దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని లెఫ్ట్నెంట్ కల్నల్ సుంకరి శ్రీనివాసరావు అన్నారు. ఆర్మీ ఉద్యోగాలపై నడిగూడెం కోటలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత విద్యారంగంతో పాటు ప్రస్తుత పరిస్థితిలో ఆర్మీలో చేరి దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటాలన్నారు. డాక్రీ డైరెక్టర్ కుర్రా జితేందర్బాబు మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగిన మునగాల పరగాణలో దేశం కోసం ఎందరో త్యాగాలు చేశారని, సైనికులుగా ఇక్కడి యువత సేవలందించి ఆ స్ఫూర్తిని కొనసాగించాల న్నారు. నడిగూడెం, మునగాల మండలాల నుంచి పెద్దసంఖ్యలో యువకులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఫ్రాన్సిస్, సైనిక సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఫుట్బాల్ కోచ్ కోచ్ ప్రకాష్, వీఎల్ఎన్చారి, పోతురాజు నర్సయ్య పాల్గొన్నారు.