ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి: కలెక్టర్ పాజిటిల్
ABN , First Publish Date - 2020-08-04T10:44:10+05:30 IST
ఎంజీయూ యూనివర్సిటీలోని బ్లాక్ ప్లాంటేషన్లో మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ, ఆగస్టు 3 : ఎంజీయూ యూనివర్సిటీలోని బ్లాక్ ప్లాంటేషన్లో మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సో మవారం భూమిని చదును చేసే పనులను ఆయన పరిశీలించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 32 ఎకరాల్లో యూకలిప్టస్ మలబార్ పండ్ల మొక్కలు నాటాలని, 24ఎకరాల్లో యూకలిక్టర్స్, ఐదెకరాల్లో మలబార్, మిగతా మూడెకరాల్లో మామిడి, అల్లనేరేడు, జామ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ ప్రతిమాసింగ్, డీఎ్ఫవో శాంతారాం, గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్రెడ్డి, నార్కట్పల్లి ఎంపీడీవో సాంబశివరావు పాల్గొన్నారు.
ఎస్ఐలకు బెటాలియన్లో శిక్షణ ప్రారంభం
నల్లగొండ క్రైం : 12వ బెటాలియన్ ఇన్స్టిట్యూషన్లో సబ్ ఇన్స్పెక్టర్కు సోమవారం ట్రై నింగ్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్వీ.సాంబయ్య హాజరై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, ట్రైనింగ్ సిబ్బంది, ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.