ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
ABN , First Publish Date - 2020-12-31T04:40:10+05:30 IST
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.

చింతపల్లి, డిసెంబరు 30 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల్లి రాంగనర్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.30వేల చెక్కును బుధవారం ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.