చెర్వుగట్టులో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2020-12-15T06:28:01+05:30 IST

కార్తీక మాసం చివరి సోమవారంతోపాటు అమావాస్య తిఽథి కావడంతో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రధానాలయంతో పాటు ఉపాలయాల వద్ద భక్తులు క్యూకట్టారు.

చెర్వుగట్టులో భక్తుల రద్దీ
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో భక్తులు

ఘనంగా పూజా కార్యక్రమాలు

నార్కట్‌పల్లి, డిసెంబరు 14: కార్తీక మాసం చివరి సోమవారంతోపాటు అమావాస్య తిఽథి కావడంతో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం  చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో  భక్తుల రద్దీ నెలకొంది. ప్రధానాలయంతో పాటు ఉపాలయాల వద్ద భక్తులు క్యూకట్టారు. ఉపాలయాల ప్రాంగణాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. పలువురు దంపతులు సత్యదేవుడి వ్రతాలు, మహామండపంలో సామూహిక శివాభిషేకం నిర్వహించారు. స్వామివారికి రాత్రి లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరవడంతో మహామండపంలోనే లక్ష పుష్పార్చన చేశారు. భక్తులు కొందరు బోనాలు తీసుకురాగా, మరికొందరు రేణుకా ఎల్లమ్మకు ఊయల ముడుపులు కట్టారు. క్యూలైన్‌లో నిలబడి ఓపిక నశించిన భక్తులు తాత్కాలిక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మూడుగుండ్లపైకి వెళ్లిన భక్తులు క్షీరాభిషేకం చేసి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టడంతో క్యూలో నిల్చున్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో వచ్చిన పోలీసులు రద్దీని నియంత్రించారు. , దేవస్థానం వద్ద కుళాయి నుంచి సరిగా నీరు రాకపోవడంతో దాహం తీర్చుకునేందుకు భక్తులు ఇబ్బందిపడ్డారు. ఇక భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పలువురు భక్తుల మొబైల్‌ ఫోన్లు చోరీకి గురయ్యాయి.



Updated Date - 2020-12-15T06:28:01+05:30 IST