నాలుగు ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-03-16T12:12:37+05:30 IST
మండలంలోని తాటికోలు వాగునుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను గ్రామస్థులు ఆదివారం ఉదయం
దేవరకొండ, మార్చి 15: మండలంలోని తాటికోలు వాగునుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను గ్రామస్థులు ఆదివారం ఉదయం పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తా టికోలు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆదివారం ఉదయం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని దేవరకొండ పోలీ్సస్టేషన్కు తరలించినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.