గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

ABN , First Publish Date - 2020-12-06T04:38:59+05:30 IST

రాష్ట్రంలో 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకొని గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేస్తామని పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేస్తాం
మోత్కూరులో విజయోత్సవ ర్యాలీ

యాదాద్రి రూరల్‌: రాష్ట్రంలో 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకొని గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేస్తామని పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. శనివారం గుట్టలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినందులకు ర్యాలీ నిర్వహిస్తూ బాణాసంచా కాల్చారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో నాయకులు చిత్తర్ల కృష్ణగౌడ్‌, సుబ్బూరు వీరస్వామి, శారాజి లక్ష్మయ్య, నేరేళ్ల సంతోష్‌, చుక్కల రాము, దొమ్మాట రాజు, భూదాన్‌పోచంపల్లిలో బీజేపీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మండల కమిటీ అధ్యక్షుడు మేకల చొక్కారెడ్డి, పట్టణ కమిటీ అధ్యక్షుడు గంజి బస్వలింగం, ఎన్నం శివకుమార్‌, చిక్క కృష్ణ, నోముల గణేష్‌, చౌటుప్పల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల భిక్షంగౌడ్‌, రమనగోని శంకర్‌, రిక్కల సుధాకర్‌ రెడ్డి, ఊడుగు వెంకటేశం, కౌన్సిలర్‌లు బి.మల్లేశం, పి.శ్రీధర్‌ బాబు, నాగరాజు, మోత్కూరులో రైల్వే బోర్డు సభ్యుడు కొణతం నాగార్జునరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్‌, బొట్టు అబ్బయ్య, గౌరు శ్రీనివాస్‌, ఎస్‌.లక్ష్మీనర్సింహారెడ్డి, బి.రాజు, ఎస్‌.మనోహర్‌, ఆరె శ్రీనివాస్‌, ఎం.తిరుమలేష్‌, కె.కృష్ణ, మాసిరెడ్డి,  తుర్కపల్లిలో కొక్కొండ లక్ష్మీనారాయణ, మేకల శ్రీనివాస్‌, గొర్ల రాంచంద్రం, శేఖర్‌యాదవ్‌, ఆకుల సైదులు, రాజుగౌడ్‌, బోళ్ల నర్సింహ, సురేష్‌, క్రాంతి, సందీప్‌, చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.  

Updated Date - 2020-12-06T04:38:59+05:30 IST