అసైన్డ్‌ భూములపై వెంటనే విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-04T05:22:45+05:30 IST

యాదగిరిగుట్ట మండలవ్యాప్తంగా అసైన్డ్‌ భూములపై కలెక్టర్‌ వెంటనే విచారణ చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్‌చేశారు.

అసైన్డ్‌ భూములపై వెంటనే విచారణ చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న గోద శ్రీరాములు

సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 3: యాదగిరిగుట్ట మండలవ్యాప్తంగా అసైన్డ్‌ భూములపై కలెక్టర్‌ వెంటనే విచారణ చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్‌చేశారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో మండల కౌన్సిల్‌ సమావేశం రాయగిరి బాలకిషన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్టర్లు కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్‌, సహాయ కార్యదర్శి కల్లెపల్లి మహేందర్‌, సుబ్బూరు నర్సింహ, పేరబోయిన పెంటయ్య, నాగయ్య, నరేష్‌, దండెబోయిన అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:22:45+05:30 IST