సరిహద్దుల్లో పకడ్బందీ చర్యలు : ఆర్డీఓ
ABN , First Publish Date - 2020-04-09T11:02:23+05:30 IST
యాదాద్రిభువనగిరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేకపోయినా, సూర్యాపేట జిల్లా వర్దమానుకోటలో పాజిటివ్ కేసులు నమోదైనందున ముందుజాగ్రత్తగా
యాదాద్రి, ఏప్రిల్8(ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేకపోయినా, సూర్యాపేట జిల్లా వర్దమానుకోటలో పాజిటివ్ కేసులు నమోదైనందున ముందుజాగ్రత్తగా సరిహద్దున గల భువనగిరి రెవెన్యూ డివిజన్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు ఆర్డీఓ ఎంవీ.భూపాల్రెడ్డి తెలిపారు. పాజిటివ్ కేసులతో ప్రత్యక్ష, పరో క్షం సంబంధాలున్న ప్రజలను గుర్తించి అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, బీబీనగర్ మండలాల నుంచి 149మందిని హోం క్వారెంటైన్ చేసినట్టుగా వివరించారు. ఆ గ్రామం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేయడమే గాక రెవెన్యూ, వైద్యసిబ్బందిని పర్యవేక్షణ పెట్టినట్టుగా వివరించారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన 14,409మందికి బియ్యం, డబ్బులు అందించామన్నారు. 740మంది నిరుపేదలకు దాతల సాయంతో ఆహారం అందజేస్తున్నామన్నారు.