అమరవీరులకు ఘన నివాళి
ABN , First Publish Date - 2020-09-12T09:41:24+05:30 IST
అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

నల్లగొండ టౌన్ / నాగార్జునసాగర్, సెప్టెంబరు11 : అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎ్ఫవో శాంతారాంతోపాటు ఎఫ్డీవో రాజేంద్రకుమార్ ఇతర సిబ్బంది అటవీ అమరవీరుల స్థూపం చిత్రపటం వద్ద పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా డీఎ్ఫవో మాట్లాడుతూ అటవీ ఉద్యోగుల భద్రత, సంక్షేమంపై పలు సూచనలు చేశారు. అటవీ సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించి అటవీ విస్తీర్ణం పెంపునకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ రమేష్, డిప్యూటీ ఎఫ్ఆర్ఏ డి.మహారాజ్, ఎఫ్బీవో మల్లేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సాగర్ డివిజన్ అటవీ శాఖ కార్యాలయంలో అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఫ్డీవో సర్వేశ్వర్, ఎఫ్ఆర్వో రామేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.