ప్రకటనలు డీపీఆర్వో ద్వారా పంపాలి
ABN , First Publish Date - 2020-11-21T05:52:47+05:30 IST
జిల్లాలోని అన్ని శాఖల అఽధికారులు తమ కార్యాలయాల నుంచి జారీ చేసే ఆర్థిక పరమైన ప్రకటనలు, నోటిఫికేషన్లు, టెండర్ నోటీసులు, భూ సేకరణ ప్రకటనలను విధిగా కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వారి ద్వారా మాత్రమే జారీ చేయాలని కలెక్టర్ ఎం.హన్మంతరావు తెలిపారు.

కలెక్టర్ హన్మంతరావు
సంగారెడ్డి క్రైం, నవంబరు 20 : జిల్లాలోని అన్ని శాఖల అఽధికారులు తమ కార్యాలయాల నుంచి జారీ చేసే ఆర్థిక పరమైన ప్రకటనలు, నోటిఫికేషన్లు, టెండర్ నోటీసులు, భూ సేకరణ ప్రకటనలను విధిగా కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వారి ద్వారా మాత్రమే జారీ చేయాలని కలెక్టర్ ఎం.హన్మంతరావు తెలిపారు. ప్రభుత్వ శాఖల నుంచి జారీ చేసే ప్రకటనలు తప్పనిరిగా సమాచార శాఖ ద్వారా జారీ చేయాలని, నిర్దిష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్లు, లోకల్ బాడీస్ అధికారులు నేరుగా పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక ముందు అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్లు, స్థానిక సంస్థల అధికారులు తప్పనిసరిగా కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, సమాచార భవన్ ఏసీ గార్డ్స్ మాసబ్ట్యాంక్, హైదరాబాద్ కార్యాలయం ద్వారా జారీ చేయాలని సూచించారు. ప్రకటనలు జారీ చేయడానికి సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకుల వారి మొబైల్ నంబరు 9949351678లో సంప్రదించాలన్నారు. అలాగే మెయిల్ అడ్రస్ ఐపిఆర్.టిఎ్సఎడివిటి ఎట్దరేట్ జిమెయిల్.కామ్కు పంపాలని సూచించారు. ఆర్థిక శాఖ ఆదేశాలకు విరుద్ధంగా అధికారులు ఎవరు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రకటనలు జారీ చేయరాదని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేస్తే సంబంధిత అధికారులే బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు.