‘మా ఊళ్లో కంపెనీ పెట్టొద్దు’
ABN , First Publish Date - 2020-12-01T06:11:12+05:30 IST
పరిశ్రమ నిర్మాణం కోసం పంచాయతీ పాలకవర్గం అనుమతి ఇవ్వకూడదని వార్డు సభ్యులు, కార్యదర్శిని పంచాయతీ కార్యాలయంలో బంధించిన సంఘటన కొల్చారం మండలం రాంపూర్లో సోమవారం జిరిగింది.
‘మా ఊళ్లో కంపెనీ పెట్టొద్దు’
కొల్చారం, నవంబరు 30: పరిశ్రమ నిర్మాణం కోసం పంచాయతీ పాలకవర్గం అనుమతి ఇవ్వకూడదని వార్డు సభ్యులు, కార్యదర్శిని పంచాయతీ కార్యాలయంలో బంధించిన సంఘటన కొల్చారం మండలం రాంపూర్లో సోమవారం జిరిగింది. గ్రామ శివారులో టీఎ్సఐఐఐడీఎస్ అనే పరిశ్రమ ఏర్పాటు కోసం పంచాయతీ పాలకవర్గం అనుమతి ఇస్తూ తీర్మానం చేయడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు ఇష్టం లేకపోయినా ఎలా తీర్మానం చేస్తారంటూ పాలకవర్గాన్ని కార్యాలయంలోనే బంధించి తాళం వేశారు. ఎస్ఐ శ్రీనివా్సగౌడ్ గ్రామస్థులతో మాట్లాడి.. మరోసారి గ్రామసభ సమావేశం నిర్వహించి గ్రామస్థుల అభిప్రాయం మేరకు తీర్మానం చేస్తారని ప్రకటించడంతో ఆందోళన విరమించారు.