చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2020-12-11T06:31:12+05:30 IST

చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన మండలంలోని వీరన్న గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి గల్లంతు

గుమ్మడిదల, డిసెంబరు 10: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన  మండలంలోని వీరన్న గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు కథనం మేరకు.. వీరన్న గూడెం గ్రామానికి చెందిన పొన్నబోయిన రాజు (40)అనే వ్యక్తి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గ్రామ శివారులో ఉన్న వీరన్న చెరువులో చేపలు పట్టేందుకని వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చి, గ్రామస్థులతో కలిసి గాలించినా ఆచూకీ లభించలేదు. నేడు గజ ఈతగాళ్లతో గాలించనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-11T06:31:12+05:30 IST