సింగూరు జల విద్యుత్‌ కేంద్రంలో

ABN , First Publish Date - 2020-10-08T08:33:00+05:30 IST

సింగూరు ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రంలో 0.712 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు జెన్‌కో ఏడీఈ సౌజన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సింగూరు జల విద్యుత్‌ కేంద్రంలో

పుల్‌కల్‌, అక్టోబరు 7 : సింగూరు ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రంలో 0.712 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు జెన్‌కో ఏడీఈ సౌజన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4, 5వ తేదీల్లో మంజీర రిజర్వాయర్‌కు సింగూరు ప్రాజెక్టు నుంచి 0.5 టీఎంసీ జలాలను విడుదల చేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎడమ వైపున నిర్మించిన రెండు 7.5 మిలియన్‌ యూనిట్ల సామర్థ్యం గల టర్బైన్ల ద్వారా జలాలను విడుదల చేశామని తెలిపారు.


48 గంటల పాటు రెండు టర్బైన్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో 0.712 మిలియన్‌ యూనిట్ల జల విద్యుదుత్పత్తిని చేశామని ఆమె వెల్లడించారు. ఈ నెల 4న ప్రారంభమైన నీటి విడుదల 6 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిందని తెలిపారు. అయితే 0.5 టీఎంసీ నీటి విడుదల పూర్తి కావడంతో రెండు జల విద్యుత్‌ గేట్లను మూసివేశామని పేర్కొన్నారు. రెండు టర్బైన్ల ద్వారా ఉత్పత్తయిన జల విద్యుత్‌ను సదాశివపేట, జోగిపేట ఫీడర్ల గుండా పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేశామని వివరించారు.

Updated Date - 2020-10-08T08:33:00+05:30 IST