బాలికలను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-12-02T05:23:14+05:30 IST

కొండపాక, డిసెంబరు 1 : ప్రేమ పేరుతో ఇద్దరు బాలికలను మోసం చేసిన యువకుడిని కుకునూర్‌పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు.

బాలికలను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

కొండపాక, డిసెంబరు 1 : ప్రేమ పేరుతో ఇద్దరు బాలికలను మోసం చేసిన యువకుడిని కుకునూర్‌పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. తొగుట సీఐ రవీందర్‌ వివరాల ప్రకారం మేదినీపూర్‌ గ్రామానికి చెందిన రామోల్ల ప్రశాంత్‌ అనే యువకుడు మాథ్‌పల్లి, మేదినీపూర్‌ గ్రామాలకు చెందిన బాలికలను ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ బాలికను గర్భవతిని చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాయిరామ్‌ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. 

Updated Date - 2020-12-02T05:23:14+05:30 IST