ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-13T05:52:27+05:30 IST

ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్‌ రాజీవ్‌ రహదారిపై శనివారం జరిగింది.

ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరి మృతి
ఆటోను ఢీకొట్టిన లారీ

బెజ్జంకి, డిసెంబరు 12: ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్‌ రాజీవ్‌ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని లాలాపేటకు చెందిన షేక్‌ హుస్సేన్‌ కుటుంబ సభ్యులు కరీంనగర్‌ మున్సిపల్‌ పరిధిలోని రేకుర్తిలో గారిమి పండుగకు హాజరై శనివారం కరీంనగర్‌ నుంచి ఆటోలో హైదరాబాద్‌కు బయలుదేరారు. గాగిళ్లాపూర్‌ రాజీవ్‌ రహదారి స్టేజి వద్ద రోడ్డు మరమ్మతులు జరుగుతుండడంతో వన్‌ వే ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న పాల ట్యాంకర్‌ ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న షేక్‌ నజీర్‌(25), యకుబి(12) మృతి చెందారు. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌ వే ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.


Updated Date - 2020-12-13T05:52:27+05:30 IST