సీఎంకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2020-12-11T05:33:50+05:30 IST

సిద్దిపేట పర్యటనకు గురువారం సిద్దిపేటకు వెళ్తుండగా సీఎం కేసీఆర్‌కు కుకునూరుపల్లి పరిసర ప్రాంతం ప్రజలు కుకునూరుపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు.

సీఎంకు ఘన స్వాగతం
కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న కుకునూరుపల్లివాసులు

కొండపాక, డిసెంబరు 10: సిద్దిపేట పర్యటనకు గురువారం సిద్దిపేటకు వెళ్తుండగా సీఎం కేసీఆర్‌కు కుకునూరుపల్లి పరిసర ప్రాంతం ప్రజలు కుకునూరుపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. కుకునూరుపల్లి కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతినరేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అమరేందర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-11T05:33:50+05:30 IST