విద్యాధరిలో వైభవంగా కార్తీక దీపోత్సవం
ABN , First Publish Date - 2020-12-13T05:50:19+05:30 IST
వర్గల్ విద్యాధరిలో కార్తీకమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

హాజరైన పుష్పగిరి, రాంపురం పీఠాధిపతులు
వర్గల్, డిసెంబరు 12: వర్గల్ విద్యాధరిలో కార్తీకమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకలకు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి, తొగుట రాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతీ హాజరయ్యారు. సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక జ్యోతులను వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో విజయదుర్గ ఆలయ వ్యవస్థాపకులు హరినాథశర్మ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాశర్మ, జడ్పీటీసీ బాలుయాదవ్, ఎంపీపీ జాలిగామ లతరమేశ్గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, సర్పంచ్ గోపాల్రెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.