కొనుగోళ్లలో సామాజిక దూరం..

ABN , First Publish Date - 2020-03-25T13:09:04+05:30 IST

హుస్నాబాద్‌ డివిజన్‌లో మంగళవారం కిరణాషాపులు, కూరగాయలు, పండ్లు, మందుల దుకాణాల వద్ద సందడి కనిపించింది. పట్టణంలో కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా గుమిడూడడంతో అధికారులు చర్యలు

కొనుగోళ్లలో సామాజిక దూరం..

హుస్నాబాద్‌, మార్చి 24: హుస్నాబాద్‌ డివిజన్‌లో మంగళవారం కిరణాషాపులు, కూరగాయలు, పండ్లు, మందుల దుకాణాల వద్ద సందడి కనిపించింది. పట్టణంలో కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా గుమిడూడడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. హుస్నాబాద్‌ బస్టాండ్‌లో తాత్కాలిక మార్కెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ సామాజిక దూరం పాటిస్తూ కూరగాయాలను విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అనిత నూతన మార్కెట్‌ను సందర్శించి ధరలను పరిశీలించారు.

Updated Date - 2020-03-25T13:09:04+05:30 IST