ఆరోగ్యవంతమైన నారే మేలు

ABN , First Publish Date - 2020-07-09T11:50:05+05:30 IST

ఆరోగ్యవంతమైన వరినారు మళ్లతోనే పంటలకు మేలని తోర్నాల వ్యవసాయ పరిశోధనా సంస్థ..

ఆరోగ్యవంతమైన నారే మేలు

నారాయణరావుపేట, జూలై 8 : ఆరోగ్యవంతమైన వరినారు మళ్లతోనే పంటలకు మేలని తోర్నాల వ్యవసాయ పరిశోధనా సంస్థ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏవీ రామాంజనేయులు రైతులకు సూచించారు. బుధవారం నారాయణరావుపేట మండలంతో పాటు ఇబ్రహీంపూర్‌లో వరినారు మళ్లను పరిశీలించి మాట్లాడారు. మెరుగైన నారు తయారీ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నారుమడిలో నారు కుళ్లిపోవడం, వాసన రావడంతో పాటు మొలకెత్తిన విత్తనాలు సరిగ్గా పెరగకపోవడం వంటి సమస్యలు వస్తాయన్నారు.


ముఖ్యంగా నారు మడిలో అధిక నీరు నిల్వ ఉండకూడదని చెప్పారు. నారుమడికి సాయంత్రం నీళ్లు ఇచ్చి మరుసటిరోజు ఉదయం తీసేయాలని సూచించారు. రెండు కిలోల డీఏపీ, ఒక కిలో యూరియా, ఒక కిలో పొటాష్‌ నారుమళ్లలో చల్లుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త శ్రీనివాస్‌, వ్యవసాయాధికారి విద్యాకర్‌రెడ్డి, సర్పంచ్‌ దేవయ్య, ఏఈవో నాగార్జున్‌, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T11:50:05+05:30 IST