మున్సిపల్ కార్మికులపై పూల వర్షం
ABN , First Publish Date - 2020-05-08T06:52:01+05:30 IST
ప్రధాని మోదీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించి వారిపై గురువారం బీజేపీ నాయకులు పూల వర్షం
![మున్సిపల్ కార్మికులపై పూల వర్షం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సంగారెడ్డి అర్బన్, మే 7: ప్రధాని మోదీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించి వారిపై గురువారం బీజేపీ నాయకులు పూల వర్షం కురిపించారు. సంగారెడ్డిలోని ఐబీలో మున్సిపల్ కార్మికులను వరుసలో నిలబెట్టి పూలు చల్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్, పట్టణ అధ్యక్షుడు వినోద్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరీబాయి తదితరులు పాల్గొన్నారు.