ప్రభుత్వ భూమి కబ్జాకు విఫలయత్నం

ABN , First Publish Date - 2020-11-21T06:03:50+05:30 IST

రామచంద్రాపురం మండలం వెలిమెలలో రూ.6 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేయడానికి యత్నించారు.

ప్రభుత్వ భూమి కబ్జాకు విఫలయత్నం
ప్రభుత్వ భూమిలో నిర్మాణాన్ని తొలగింపజేస్తున్న వీఆర్వో రాజమల్లేశం

రామచంద్రాపురం, నవంబరు 20: రామచంద్రాపురం మండలం వెలిమెలలో రూ.6 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేయడానికి యత్నించారు. ప్రభుత్వ సర్వే నంబరు 369లో ఓ వ్యక్తి సుమారు 20 గుంటల స్థలాన్ని చదును చేసి హద్దులు పాతేందుకు సిద్ధపడ్డాడు. సర్వే నంబరు 315లో సుమారు రూ.30 లక్షల విలువ చేసే భూమిలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. విషయాన్ని స్థానికులు వీఆర్‌వో రాజమల్లేశం దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్‌ కె.శివకుమార్‌ ఆదేశాల మేరకు రాజమల్లేశం శుక్రవారం ఆ భూములను గుర్తించారు. సిబ్బందితో వెళ్లి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి యత్నించిన వారి విషయంలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.

Updated Date - 2020-11-21T06:03:50+05:30 IST