బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు ఒకటి.. జిల్లాలో ఆందోళన మరో అంశంపై

ABN , First Publish Date - 2020-12-15T05:47:07+05:30 IST

పీఆర్‌సీ ప్రకటించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లా బదిలీలకు అనుమతించాలని, ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 14న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లా కమిటీలను ఆదేశించారు.

బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు ఒకటి.. జిల్లాలో ఆందోళన మరో అంశంపై

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 14 : పీఆర్‌సీ ప్రకటించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లా బదిలీలకు అనుమతించాలని, ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 14న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లా కమిటీలను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆందోళనలు జరగగా ఒక్క సంగారెడ్డి జిల్లాలో మాత్రం రైతాంగ సమస్యలపై మాత్రమే ధర్నా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇచ్చిన ఆదేశం జిల్లా కమిటీకి అందడంలో అవగాహన లోపమో లేక మరే కారణమో తెలియదు కానీ ఉద్యోగుల సమస్యలపై చేయాల్సిన ఆందోళనను పక్కన పెట్టి రైతుల సమస్యలపై ధర్నా చేయడంపై ఆ పార్టీలోని పలువురు విస్మయం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-15T05:47:07+05:30 IST