ఉద్యోగుల సమస్యలపై బీజేపీ ఆందోళన

ABN , First Publish Date - 2020-12-15T05:56:16+05:30 IST

ఉద్యోగుల సమస్యలపై బీజేపీ ఆందోళన

ఉద్యోగుల సమస్యలపై బీజేపీ ఆందోళన
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నేతలు

కలెక్టరేట్‌ ఎదుట నిరనస.. పలువురు నేతల అరెస్టు


మెదక్‌ రూరల్‌, డిసెంబరు 14: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌  డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్‌ ఎదుట సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రెండేళ్లుగా ఐఆర్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. కరోనా కాలంలో కోత విధించిన వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ  ఉద్యోగులను వేతనాలను  సకాలంలో ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. ధనిక రాష్ట్రం అంటూనే జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దిగజార్చడం దారుణమన్నారు. ఉద్యోగుల డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఆరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నేతలను ఎమ్మెల్యే రఘునందర్‌రావు కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఆందోళనలో బీజేపీ జిల్లా కార్యదర్శి విజయ్‌, పలువురు జిల్లాస్థాయి నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T05:56:16+05:30 IST