రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-11-26T06:31:38+05:30 IST
చేగుంట మండలం రెడ్డి పల్లి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు చేగుంట ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.
![రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చేగుంట, నవంబరు 25: చేగుంట మండలం రెడ్డి పల్లి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు చేగుంట ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మంగళవారం రాత్రి రామాయంపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.